కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని మాజీ మంత్రి, పట్టభధ్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి,ప్రభుత్వ విప్,ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా శుక్రవారం జగిత్యాలలోని పొన్నాల గార్డెన్లో పట్టభద్రులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ,ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే దాదాపు 56 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందన్నారు. గత 10 ఏళ్ల బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించిన పాపాన పోలేదని విమర్శించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గడపగడపకు వెళ్లి పట్టభద్రులను కలిసి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించి పట్టభధ్రుల ఓట్లు అడగాలని సూచించారు.గత ఎన్నికల్లో ఎలా కష్టపడ్డారో అదే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం మనందరం కష్టపడి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను, నాయకులను వారు కోరారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నా గెలుపు నాంది కావాలనిచెబుతూ , మొదటి ప్రాధాన్యత ఓటు వేసినన్ను ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టభధ్రులను నరేందర్ రెడ్డి కోరారు.
విద్యా హాబ్ గా మారుస్తానని, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల కోసం కృషి చేస్తానని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa