ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదల సంక్షేమం.. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 08:41 PM

పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పనిచేస్తుందని, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చారిత్రాత్మకంగా నిలుస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ నేత శివారెడ్డి, మల్లేషం గౌడ్ ఆధ్వర్యంలో బెజుగామకు చెందిన పలువురు యువకులు ప్రవీణ్, అనిల్, కన్నాకర్, దివాకర్, రాజు, మహిపాల్, శ్యాం, కుమార్, స్వామి, ప్రవీణ్, సాయి, మధు, అనిల్, రాజు, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి పార్టీ కండువా కప్పి వారిని స్వాగతించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా కుల గణన సాహసోపేతమని, చారిత్రాత్మకంగా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్ కట్టుబడి పనిచేస్తుండగా, అన్ని వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా ఆయన ప్రకటించారు. పంట రుణమాఫీ, రైతు భరోసాతో అన్నదాతలు సంతోషంగా ఉండగా, త్వరలోనే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డుల పంపిణీ, ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీటుగా తిప్పికొట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ అమలుకు సుముఖంగా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి బీసీల పాలిట దైవంగా నిలుస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గజ్వేల్ అభివృద్ధి గాలిలో దీపంగా మారిందని, మన ఎమ్మెల్యే కెసిఆర్ బయటకు రాడని, దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే పెండింగ్ దశలో నిలిచిపోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నక్క రాములు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa