ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెున్న పింక్ బుక్ అని చెప్పిన కవిత,,,నేడు ఆరెంజ్ బుక్ తెరపైకి తీసుకొచ్చిన ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 07:49 PM

తెలంగాణలో ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు పాలిటిక్స్ కూడా అంతే హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 'బుక్' పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెరమీదకు తీసుకొచ్చి బుక్ పాలిటిక్స్ కల్చర్ ప్రస్తుతం తెలంగాణలోకూ వ్యాపించింది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా.. ప్రభుత్వ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తీసుకునే తప్పుడు నిర్ణయాలను తాము రెడ్ బుక్‌లో రాస్తున్నట్లు లోకేష్ ఓ డైరీ చూపించారు. అందులో చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే అందరి ఉద్యోగుల పేర్లు నమోదు చేస్తున్నామని.. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామి లోకేష్ హెచ్చరించారు.


ప్రస్తుతం తెలంగాణలోనూ బుక్ కల్చర్ మెుదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలు తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. ప్రభుత్వం చేస్తున్న తప్పులు, సీఎం రేవంత్ రెడ్డి అరాచకాలను 'పింక్ బుక్‌'లో నోటు చేస్తున్నామన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని తాము అధికారంలోకి రాగానే.. చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడిన నేతలు, అధికారులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాజాగా.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా 'ఆరెంజ్ బుక్' తెరమీదకు తీసుకొచ్చారు.


ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో పర్యచించిన ఎంపీ ఈటల .. అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు. బాస్‌ల ఆదేశాలు మేరకు కాకుండా.. చట్టానికి, నిబంధనలకు లోబడి పనిచేయాలని హితవు పలికారు. లేదంటే కఠిన చర్యలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. తాము కూడా 'ఆరెంజ్‌ బుక్' మెయిన్‌టైన్ చేస్తున్నామన్న ఈటల.. ఆ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నామన్నారు. ఎల్లకాలం కాంగ్రెస్ అధికారంలో ఉండదని... సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.


ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి బంధువులు, మిత్రులు చెప్పారని చట్టవ్యతిరేక పనులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు భావిస్తే ఉద్యోగులకు తగదన్నారు. టైం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయటపెడతామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బుక్ పాలిటిక్స్ ట్రెండ్ అవుతోంది. బీఆర్ఎస్ పింక్ బుక్ తెరపైకి తీసుకొస్తే.. బీజేపీ ఆరెంజ్ బుక్ ఉందని హెచ్చరిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa