ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక సరఫరాపై నిఘా పెంచాలి: కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 12:45 PM

ఇటుకల పహాడ్ ఇసుక రీచ్ల నుంచి సరఫరా చేసే ఇసుకపై పూర్తి నిఘా ఉంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మైనింగ్, తదితర శాఖల అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం, వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలను తనిఖీ చేశారు.వంగమర్తి, ఇటుకలపహాడ్‌ రీచ్‌ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాల్లో ఇది వరకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వే బ్రిడ్జి, ఇసుకను లోడ్‌ చేసే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారాని, రాత్రి సమయాల్లో కూడా స్పష్టంగా కనిపించే సామర్థ్యం కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటివరకు వంగమర్తి ఇసుక రీచ్‌ నుండి తీసిన ఇసుక పరిమాణం వివరాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం వంగమర్తి ఇసుక రీచ్‌ నుంచి లక్షా 16వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను తీసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa