ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాద యాత్రగా మారిన విహార యాత్ర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 12:41 PM

 సరదాగా విహారయాత్రకు వెళ్లిన వైద్యుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ అనన్యరావు (27) మృతిచెందారు. ఈ ఘటన కర్ణాటకలోని సణాపుర వద్ద బుధవారం ఉదయం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ అనన్యరావు(26) స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయిపై నుంచి అనన్యరావు నీటిలో దూకి ఈత కొట్టాలనుకుంది. రాయిపై నుంచి నీటిలో దూకేసింది. ఆ సమయంలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa