ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గెలిపించుకోవాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 09:38 PM

ముస్తాబాద్  మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ  ఎన్నికలలో భాగంగా  కార్యకర్తల సమీకృత సమ్మేళన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కె.కె మహేందర్ రెడ్డి  రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టభద్రుల ఎన్నికల ఇన్చార్జి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విచ్చేసి ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి కార్యకర్త సైనికుల్లాగా చేయాలని కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించారు
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రుల ఉన్న ఓట్లను ఎక్కువ శాతం  నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి . పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు  జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa