నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్ద్ ఫ్లూ కలకలం. గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో 7000 కోళ్లు మృతి. మొత్తం 13 వేల కోళ్లను కొనుగోలు చేయగా అందులో 7000 కోళ్లు మరణించాయని దీంతో 4 లక్షల వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన యజమాని.చెరుకుపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో గత కొన్ని రోజులుగా కోళ్లు అనారోగ్యానికి గురవుతుండగా, ఈ సమస్య మరింత తీవ్రమై సుమారు 7,000 కోళ్లు ఆకస్మికంగా మరణించాయి. ఈ ఘటనతో గ్రామస్తుల మధ్య భయాందోళనలు వ్యక్తమయ్యాయి. బర్డ్ ఫ్లూ సోకినట్టుగా అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రైతులు తక్షణమే స్పందించి, చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు.కోళ్లు అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని గమనించిన వెంటనే రైతులు హైదరాబాద్ నుంచి నిపుణులైన వెటర్నరీ డాక్టర్లను రప్పించారు. అయితే, పలు మార్లు వైద్యం అందించినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. రైతులు తమ కోళ్లను రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ, అనారోగ్యం మరింత తీవ్రమై కోళ్ల మరణాన్ని తలపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa