ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంకె బిందెలు ఉన్నాయనుకొని హామీలు ఇచ్చారట: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 12:45 PM

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక..  కాంగ్రెస్ కుంటి సాకులు చెబుతుందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం వల్ల తెలంగాణలో వ్యవసాయం పెరిగిందని అనేక నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. హామీలు అమలుచేయడం చేతకాక, లంకెబిందెలు ఉన్నాయనుకొని హామీలు ఇచ్చామని రేవంత్ రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం తెలంగాణ అట్లాస్ నివేదికను నెట్ నుంచి తొలగించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలను నివేదికలో భట్టి విక్రమార్క ఉతికి ఆరేశారు. ఆ నివేదికలో తెలంగాణ దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ వన్ అని చెప్పింది. కేసీఆర్‌ హయంలో సంపద ఎలా పెరిగిందో నివేదికలో ఉంది. భారత దేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. జీఎస్‌డీపీలో తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో గుజరాత్‌ను కూడా దాటింది. గత పదేళ్లలో తెలంగాణ ఆదాయం, సంపద పెరిగిందన్నారు. 


కేసీఆర్‌ పాలనపై సొల్లు వాగుడు వాగిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ అట్లాస్ ఇప్పటికైనా చూడాలి. జీవ సంపదలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని నివేదికలో ఉంది. విద్యుత్ వినియోగం కూడా కేసీఆర్‌ ప్రభుత్వ హయంలోనే పెరిగింది. బీఆర్‌ఎస్‌ పాలనలోనే ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్‌ హయాంలో అభివృద్ధి జరిగినట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వ నివేదికనే చెబుతోంది. అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలకు వ్యతిరేకంగా నివేదిక ఉంది. అన్ని వివరాలు ఆ నివేదికలో ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ రేవంత్‌ మాత్రం మాట మార్చడం లేదంటూ మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa