తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ను కోరింది. అయితే స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ఇటీవల విచారించిన కోర్టు స్పీకర్కు కొంత సమయం ఇచ్చింది. ఈ క్రమంలో నేడు తుది విచారణ చేపట్టే అవకాశం ఉంది.వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ విషయంపై సీరియస్ గా పరిగణనలోకి తీసుకుని అనేక విధాలుగా కామెంట్స్ చేయడంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో నేటి విచారణ ఎలా సాగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa