ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంట నష్టం చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 03:29 PM

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్ లోని శాసనసభ ఆవరణలో భారతీయజనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎండిన పంటలతో నిరసన వ్యక్తం చేశారు.
వీరిని పోలీసులు లోపలికి వెళ్ళకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు, పాయల్ శంకర్, ధన్పల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa