తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. విమానాశ్రయ తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ స్టేషన్ అభివృద్ధికి రూ.26.6 కోట్లు అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో.. ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధిపై ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్లోజజ కరీంనగర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి మరియు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న అవిశ్రాంత కృషి, అంకితభావం నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇది కరీంనగర్ ప్రజలకు గర్వకారణమైన క్షణమని, అంతేకాకుండా కనెక్టివిటీలో ఒక పెద్ద ముందడుగు అని కొనియాడారు. ఈ అభివృద్ధికి సహకరించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేశారు
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద.. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం అనేక నూతన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఆధునిక టాయిలెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ప్రకాశవంతమైన లైటింగ్, మెరుగైన ప్లాట్ఫారమ్లు, ప్రయాణికుల సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్లో కూడా ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి రానున్నాయి. ఈ అభివృద్ధి వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది. అంతేకాకుండా.. ఈ స్టేషన్ ఆధునీకరణ కరీంనగర్ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి పెద్ద మొత్తంలో నిధులను కేటాయించింది. పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తెలంగాణలోని ఇతర ఎంపికైన రైల్వే స్టేషన్లలో కూడా అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్స్ స్కీమ్ లో అభివృద్ధి చేస్తున్నారు. వీటికి రూ. 1,992 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముఖ్య స్టేషన్ల వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్, జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మంతో పాటు.. ఆదిలాబాద్, బాసర, బేగంపేట, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, ఉప్పుగూడ స్టేషన్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa