హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతిని సాధించిందని అన్నారు.ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలోని సుమేధా నదిలో పడవలో ప్రయాణించామని, రివర్ ఫ్రంట్ను పరిశీలించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని, కానీ మనం ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. మీ తోడ్పాటుతో ప్రపంచంతోనే పోటీ పడవచ్చని జపాన్లోని తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం మీకు తెలుసని అన్నారు.తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి కీలకమని అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి, పరిశ్రమలు పెరిగి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa