ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 02:14 PM

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని AIMIM నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. అమాయకులను హత్య చేయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ ఉగ్ర దాడిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జమ్మూకశ్మీర్ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఒవైసీ మాట్లాడుతూ, "పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం అడిగి అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. ఈ దాడిని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. నిఘా వైఫల్యం ఈ దాడికి కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉగ్రవాదులందరికీ ప్రభుత్వం గుణపాఠం నేర్పాలి, బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం జరగాలి" అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక విదేశీ (నేపాలీ) పర్యాటకుడు కూడా ఈ దాడిలో మరణించడం అత్యంత బాధాకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa