ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ భారతితో భూములకు రక్షణ: ఎమ్మెల్యే జియంఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 04:09 PM

దేవరకద్ర మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు శుక్రవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూభారతి చట్టంతో రైతుల భూములకు భద్రత లభిస్తుందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూభారతి చట్టమని అన్నారు. ఇకపై గ్రామాల్లో భూ పంచాయితీలు, వివాదాలు ఉండవన్నారు. భూ భారతిపై ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa