రాజంపేట మండల కేంద్రంలో బుధవారం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన కేజీబీవీ రాజంపేట పాఠశాల విద్యార్థిని గుర్రాల వర్షశ్రీని గురువారం మాజీ ఎంపీటీసీ ఆముదాల రమేష్ ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షశ్రీ మంచి మార్కులతో మండలంలో టాపర్ కావడం గర్వకారణమని అన్నారు. ఆమెను చూసి ప్రతి విద్యార్థి ప్రేరణ పొందాలని, కృషితో పాటు పట్టుదల ఉంటే ఎలాంటి విజయమైనా సాధ్యమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa