కశ్మీర్ అందాలను వీక్షించేందుకు వెళ్లిన పర్యాటకులపై పహల్గామ్లో ఉగ్రాదులు దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని.. ఆ దేశంతో భారత్ దౌత్య సంబంధాలను తెంచుకుంది. సింధూ జాలల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు మన దేశంలో ఉన్న పాకిస్తానీయులు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా పహల్గామ్ లో ఉగ్రదాడి గురించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పహల్గామ్ దాడి గురించి అమెరికాకు ముందే తెలుసని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. అమెరికా నిఘా వర్గాల వద్ద పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నారు. దాడి చేసినవారు, చేసినవారి ఉద్దేశాలు, దాడి వెనక ఉన్న శక్తుల వివరాలన్నీ అమెరికా నివేదికల్లో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ పీస్ మిషన్ ద్వారా తాను ప్రపంచ కేఏ పాల్ కోసం కృషి చేశారు. అందులో భాగంగా ప్రధానమంత్రి, వైట్హౌస్ అనుమతితో పాకిస్తాన వెళ్లి ఇరు దేశాల మధ్య సంది కుదుర్చుతానని గతంలో పాల్ మాట్లాడారు. ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
పహల్గామ్ దాడి గురించి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్ ఉగ్రదాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశానికి మద్దతుగా తాము ఉంటామని ట్రంప్ తన వ్యక్తిగత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పొయినవారి ఆత్మ శాంతించాలని ప్రార్థించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన మిత్రుడు, భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. కానీ, అమెరికాకు తెలిసే పహల్గామ్లో పర్యటకులపై దాడి జరిగిందన్న పాల్ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
క్రైస్తవ మత ప్రచారకుడిగా, ప్రపంచ శాంతిదూతగా సుపరిచితుడైన కేఏ పాల్.. తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2008లో ప్రజాశాంతి పార్టీని స్థాపించారు. అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను నిలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి కేఏ పాల్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు పాల్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాల్ వ్యాఖ్యలు, పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa