ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దిగ్భ్రాంతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 01:04 PM

హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్ వద్ద సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
అదే విధంగా, మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. బాధితులకు సంతాపం తెలుపుతూ, గాయపడినవారి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa