ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇళ్ల కోసం విదేశీ టెక్నాలజీ.. రూ.5 లక్షలకే సొంతిల్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 07:50 PM

నేటి కాలంలో సొంతింటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇటుక,సిమెంట్, ఇసుక ఇలా ప్రతి దాని ధరలు ఆకాశన్నంటున్నాయి. దాంతో పేద, మధ్య తరగతి వారి సొంతింట కల.. కలగానే మిగిలిపోతుంది. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. పేదవారి సొంతింటి కల సాకారం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. దీని కింది అర్హులైన పేదలకు ఇంటి స్థలంతో పాటుగా నిర్మాణానికి కూడా ఆర్థిక సాయం చేయనుంది.


ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రేవంత్ సర్కార్ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనుంది. మొత్తం నాలుగు విడతల్లో ఈ మొత్తాన్ని లబ్ధిదారలుకు అందిస్తారు. అయితే నేటి కాలంలో 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం పూర్తి చేయడం అంటే సాధ్యం కాని పని. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5లక్షల రూపాయల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా విదేశీ టెక్నాలజీని వినియోగించుకోనుంది. ఈ బాధ్యతను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఆ వివరాలు..


ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం ఇంటి స్థలం, 5 లక్షల రూపాయల ఆర్థికసాయంతో పాటుగా.. ఆ మొత్తంలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం రేవంత్ సర్కార్ ఓ ప్రైవేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. సదరు కంపెనీ.. 45 గజాల స్థలంలో.. 5 లక్షల రూపాయల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయనుంది. కిచెన్, బెడ్రూమ్, హాల్ సౌకర్యాలతో ఇల్లు నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే సదరు కంపెనీ ఒక మోడల్ హౌజ్‌ను నిర్మించింది. ఇది ప్రభుత్వానికి నచ్చడంతో.. మరో నాలుగు జిల్లాల్లో ఈ మోడల్ ద్వారా పేదలకు ఇంటి నిర్మాణం చేసి ఇచ్చేలా సంస్థకు బాధ్యతలు అప్పగించింది.


నాలుగు జిల్లాలు ఇవే..


కొత్త టెక్నాలజీతో ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని మండాలను ఎన్నుకుంది. సదరు కంపెనీ ప్రభుత్వం ఎంపిక చేసిన మండలాల్లో కేవలం 15 రోజుల వ్యవధిలోనే.. 5 లక్షల రూపాయల లోపే అందమైన ఇంటిని నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఈ కంపెనీ ఇంటి నిర్మాణం కోసం మలేషియన్ టెక్నాలజీని ఉపయోగించనుంది. అల్యూమినియం ఫోమ్ వర్క్ టెక్నాలజీ ద్వారా ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయనుంది.


ఇంటి నిర్మాణం ఇలా ఉంటుంది..


45 స్థలాలం ఇంటి నిర్మాణంలో భాగంగా.. ముందుగా 18 ఫీట్లు వెడల్పు, 22 ఫీట్ల పొడవుతో బేస్‌మెంట్ లెవల్ పనులు ప్రారంభింస్తారు. ఐదు రోజుల్లో వీటిని పూర్తి చేస్తారు. ఆ తర్వాత పై కప్పు లెవెల్ పనులు ప్రారంభిస్తారు. ఆరు రోజుల్లోగా స్లాబ్, గోడలు పూర్తి చేస్తారు. అదే సమయంలోనే విద్యుత్ వైర్లు, ప్లంబింగ్ కు సంబంధించిన పైపులను సిద్ధం చేసి స్లాబ్ వేయడం పూర్తి చేస్తారు. మిగిలిన నాలుగు రోజుల్లో తలుపులు, కిటికీలతో పాటు బాత్రూంకు సంబంధించిన పనులను పూర్తి చేస్తారు. కేవలం రూ.5 లక్షల వ్యయంతో ఇంటిని నిర్మించి అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa