ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరు అడ్డుపడ్డా గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 07:18 PM

యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గంధమల్ల ప్రాజెక్టు పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును ఎవరైనా అడ్డుపడినా పూర్తి చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు.
"ఒకే నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లకుపైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ గంధమల్ల రిజర్వాయర్‌ పనులపై హరీష్ రావు ఏడుపు ఏంటో అర్థం కావడం లేదు. శంకుస్థాపన చేయడమే తప్పా?" అంటూ ఆయన ప్రశ్నించారు.
గంధమల్ల ప్రాజెక్టు నీటి కొరత సమస్యను పరిష్కరించే దిశగా కీలకంగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భూగర్భ జలాలు మెరుగవుతాయని, సాగునీటి అవసరాలు తీరుతాయని తెలిపారు. "ప్రాజెక్టును రాజకీయ వివాదాలవైపు లాక్కొచ్చేందుకు ఎవ్వరూ ప్రయత్నించకూడదు. ఇది ప్రజల ప్రయోజనానికి సంబంధించిన అంశం," అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa