ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాగంటి గోపీనాథ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 08, 2025, 06:38 PM

బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం పార్టీ శ్రేణులను, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.మాగంటి గోపీనాథ్ ఆదివారం (జూన్ 08) ఉదయం తుదిశ్వాస విడిచారని కేటీఆర్ తెలిపారు. "సోదరుడు, మృదు స్వభావి అయిన మాగంటి గోపీనాథ్ గారు ఈ రోజు ఉదయం మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. మనం ఒక మంచి నాయకుడిని కోల్పోయాం" అని కేటీఆర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.హైదరాబాద్ నగరాభివృద్ధిలో మాగంటి గోపీనాథ్ కీలక పాత్ర పోషించారని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి ఆయన కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆదివారం మధ్యాహ్నమే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. "ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ గారి అంత్యక్రియలు జరుగుతాయి" అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa