తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ) మరోసారి బస్సుపాసుల ధరలను పెంచింది. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో బసవాహన సంస్థ తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నదని పేర్కొంటూ, ఆదాయాన్ని పెంచేందుకు పాస్ రేట్లను సవరించినట్టు అధికారులు వెల్లడించారు. నేటి నుంచి కొత్త బస్సుపాస్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులు, మెట్రో యూజర్లకు ఈ పెంపు భారీ భారంగా మారనున్నట్లు భావిస్తున్నారు. ఇవే కొత్త ధరలు ఆర్డినరీ పాస్: రూ.1,150 నుండి రూ.1,400కి మెట్రో ఎక్స్ప్రెస్ పాస్: రూ.1,300 నుండి రూ.1,600కి మెట్రో డీలక్స్ పాస్: రూ.1,450 నుండి రూ.1,800కి అంతేకాకుండా, గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా పెంచినట్టు ఆర్టీసీ ప్రకటించింది. ఈ తాజా ధరల పెంపుతో సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అధికంగా ఉండగా, ప్రభుత్వ రవాణా సేవలు కూడా భారంగా మారడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ప్రత్యేకించి విద్యార్థుల పాస్ ఛార్జీల పెంపు వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరగనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa