ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పగిలిన గ్యాస్ పైప్ లైన్.. భయాందోళనలో స్థానికులు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 03:16 PM

మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో, స్తంభం పక్కనే ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైప్‌లైన్‌కు తగలడంతో అది పగిలిపోయింది. దీంతో భూమిలో నుంచి గ్యాస్ ఎగసిపడి, ఆ ప్రాంతంలో తీవ్రమైన వాసన వ్యాపించింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. స్థానికులు వెంటనే గ్యాస్ కంపెనీకి సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa