మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మం జిల్లాలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్నేరులో తలెత్తుతున్న వరద పరిస్థితులపై మంత్రి అధికారులతో చర్చించి, తక్షణమే అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
మున్నేటికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మున్నేరులోకి నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని మంత్రి తెలిపారు. వర్షపాతం అధికంగా ఉండటంతో మున్నేరుకు వరద ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం మున్నేరు ఖమ్మం వద్ద 14.50 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తున్నదని తుమ్మల పేర్కొన్నారు. ఇది ప్రమాదకర స్థాయిలోకి చేరనున్న సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వెంతైనా ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా, తక్కువ సమయంలో విస్తృతంగా సమాచారం చల్లించాల్సిన అవసరముందని మంత్రి సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివాసిస్తున్న ప్రజలను అవసరమైతే తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa