దుబ్బాక మండలం హబ్సిపూర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మంతూరి విఠల్ మృతి చెందగా, అతని కుమారుడు చంద్రశేఖర్ గాయపడ్డారు. సిద్దిపేట వైపు నుంచి వస్తున్న కారు వీరి టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 108 సిబ్బంది, స్థానికుల సహాయంతో గాయపడిన చంద్రశేఖర్ను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa