ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 04:08 PM

తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరి చూపుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయంగా విస్మరిస్తున్నారని, ఇది రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమస్యపై అనేకసార్లు లేఖలు, విజ్ఞప్తులు పంపినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా వంటి కీలక వనరుల కొరతతో రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
పార్లమెంటులో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీసిన తీరును సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. కేంద్రంపై పోరాటంలో ఎంపీ ప్రియాంక గాంధీ తన మద్దతు ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రైతుల పక్షాన నిలబడే శక్తిగా కాంగ్రెస్ ఉండబోతుందన్న సంకేతాలను ఆయన ఇచ్చారు.
ఇక రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై కూడా సీఎం విమర్శల బాణాలు సంధించారు. వారు రైతుల పక్షాన నిలవాల్సిన సమయంలో మోదీ భజనతో పరిమితమైపోయారని మండిపడ్డారు. అలాగే, బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో మౌనంగా ఉండిపోయిన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, “గల్లీలో లొల్లి చేసే నాయకులు మోదీ ముందు ప్రశ్నించేందుకు ఎందుకు భయపడుతున్నారు?” అంటూ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa