హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమం జరగింది. ఈ కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దాసోజు శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, గత ముఖ్యమంత్రుల కృషిని సైతం గుర్తు చేశారు. 1994 నుండి 2014 వరకు హైదరాబాద్ అభివృద్ధిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన పునాది తప్పనిసరిగా గుర్తించాల్సిందేనని ఆయన అన్నారు.
అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ కొత్త కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలు వేగంగా, పారదర్శకంగా నిర్వహించబడతాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యాలయం ప్రారంభంతో పౌరసేవల విస్తరణలో ప్రభుత్వం మరొక మెట్టు ఎక్కినట్టయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa