ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ఇరిగేషన్ శాఖకు కొత్త సలహాదారు నియామకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 21, 2025, 07:32 PM

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ  సొరంగ మార్గం పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసే లక్ష్యంతో భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్‌ను నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం హర్ పాల్ సింగ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ముఖ్యంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లను అధిగమించి, పనులను సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa