ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాట్నపల్లిలో ప్రభుత్వ పనుల జాతర ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 06:19 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర శుక్రవారం చొప్పదండి మండలం కాట్నపల్లిలో అధికారులు ప్రారంభించారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎంపిడివో వేణుగోపాల్ రావు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపివో రాజగోపాల్ రెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారి సతీష్, కొండగట్టు ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు చుప్ప శ్రీనివాస్, కొత్తపల్లి నవీన్, మాజీ సర్పంచ్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa