ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రైళ్ల నంబర్స్ మారాయ్.. కొత్త నంబర్స్ ఇవే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 07:23 PM

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్ల నంబర్లలో మార్పులు, కోచ్‌ల రకాల్లో అప్‌డేట్‌లు జరగనున్నాయి. ఇప్పటివరకు 57601/57602 నంబర్లతో నడుస్తున్న కాచిగూడ–వాడి ప్యాసింజర్కు ఇకపై 67785/67786 నంబర్లను కేటాయించారు. ఈ మార్పు ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఆగస్టు 25 నుంచి ఈ ట్రైన్ నంబర్లలో మార్పులు రానున్న నేపథ్యంలో ప్రయాణికులు గమనించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.


ఇక ప్రస్తుతం 77647/77648 నంబర్లతో నడుస్తున్న కాచిగూడ–రాయచూర్ ప్యాసింజర్ రైలుకు 67787/67788 నంబర్లను కేటాయించారు. ఈ మార్పు 26వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. అలాగే, మిర్యాలగూడ–కాచిగూడ ప్యాసింజర్ గతంలో ఉదయం 10 గంటలకు గమ్యానికి చేరుకుంటుండగా.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.20 గంటలకు చేరుకుంటుంది. ఈ సవరణ వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అనుకూలంగా ప్లాన్ చేసుకునే అవకాశం లభిస్తుంది.


ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఐసీఎఫ్  రేక్‌ల స్థానంలో ఆధునిక మెమూ రేక్‌లను ప్రవేశపెట్టాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. కాచిగూడ–వాడి మధ్య నడిచే రైలుకు ఐసీఎఫ్ రేక్ బదులుగా మెమూ రేక్‌ను వినియోగించనున్నారు. అదే విధంగా.. కాచిగూడ–రాయచూర్ ప్యాసింజర్‌కు డెమో రేక్ స్థానంలో మెమూ రేక్‌ను ఉపయోగించనున్నారు.


ఈ మార్పులు నంబర్లలోనే కాకుండా ప్రయాణ సౌకర్యాల్లోనూ మెరుగుదల తీసుకువస్తాయి. మెమూ రేక్‌లు వేగం, భద్రత, ఇంధన పొదుపులో ప్రత్యేకత కలిగినవిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రయాణించే కార్మికులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు వంటి ప్రయాణికులకు ఇది ఒక పెద్ద సౌకర్యంగా మారనుంది. ఇక రాబోయే కాలంలో మరిన్ని ప్యాసింజర్ రైళ్లలో కూడా ఇలాంటి మార్పులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా.. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల కారణంగా.. పలు రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి నడిపిస్తున్నారు. దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడకు వెళ్లేందుకు ప్రయాణ ఛార్జీలు అధికంగా అవుతున్నాయని.. ప్రభుత్వం చర్లపల్లి స్టేషన్ కు వెళ్లేందుకు.. అక్కడ నుంచి సిటీలోకి వచ్చేందుకు సరైన ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa