ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేవంత్ సొంతూరికి అదనంగా 300 ఇందిరమ్మ ఇండ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 07:43 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి ప్రభుత్వం అదనంగా 300 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసిన ప్రభుత్వం.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది.


అయితే కొండారెడ్డిపల్లి గ్రామానికి ప్రత్యేక కోటా కింద మరో 300 ఇళ్లు మంజూరు చేయాలని గృహనిర్మాణ శాఖ ఎండీ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే తొలి విడతలో అర్హులైన చాలా మందికి ఇండ్లను కేటాయించారు. తాజాగా.. మరో 300 ఇండ్లను అదనంగా మంజూరు చేశారు. ఈ ప్రత్యేక మంజూరు ద్వారా ఆ గ్రామంలోని అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేరనుంది. సర్కార్ నిర్ణయంపై కొండారెడ్డిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa