ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంటకు 14 మందిని కరుస్తున్న శనకాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 01:53 PM

తెలంగాణలో వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగింది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే 20 లక్షల వరకు శునకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది గంటకు 14 మంది కుక్కకాటుకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 13 మంది రేబిస్ వ్యాధికి గురై మృతి చెందారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,21,997 మందిని శునకాలు కరిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 87,366 మందిని కరిచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa