ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Jubilee Hills బై-ఎలక్షన్: పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ పై ECI నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 10:58 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఈ రోజు (సోమవారం) సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో 79 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. గతంలో ఉన్న 329 పోలింగ్ స్టేషన్లను 408కి పెంచే యోచనలో ఉన్నట్టు చెప్పారు.అలాగే, పోలింగ్ లొకేషన్ల సంఖ్యను 132 నుండి 145కి పెంచనున్నామని వెల్లడించారు. ఈ ప్రతిపాదిత మార్పులపై అభ్యంతరాలుంటే, రేపు (మంగళవారం) సాయంత్రం లోపు తెలియజేయాలని పార్టీ ప్రతినిధులను ఆహ్వానించారు.రేషనలైజేషన్ రిపోర్ట్‌ను ఈనెల 28వ తేదీ లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు తక్షణమే బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను సమర్పించాలని కోరారు.జనవరి నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు మొత్తం 19,237 ఓటరు దరఖాస్తులు అందగా, వీటిలో 3,767 దరఖాస్తులను నిరాకరించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa