ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేబీస్ సోకిందనే అనుమానంతో వివాహిత ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 11:01 AM

మహబూబ్‌నగర్ పట్టణంలో కొత్తగంజ్ ప్రాంతంలో అనురాగ్, అక్షర(3) అనే ఇద్దరు పిల్లలతో నివసిస్తున్న నరేష్, యశోద(36) దంపతులుఇంటి ఆవరణలో పల్లీలు, డ్రైఫ్రూట్స్ ఆరబెట్టినప్పుడు వీధికుక్కలు ఎంగిలి చేశాయని, వాటినే తిరిగి వంటలో వాడినప్పటినుండి ఇంట్లో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని తెలిపిన భర్త నరేష్. రేబీస్ టీకాలతో పాటు ఇతర వైద్యం కూడా చేయించామని, చర్మ వ్యాధుల కారణంగా తన భార్య తీవ్ర మనోవేదనకు గురైందని తెలిపిన భర్త . ఈ క్రమంలో సోమవారం ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లిన అనంతరం, భర్త కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని గోడ మీద రాసి ఉరివేసుకున్న యశోద . ఉదయం 10 గంటలకు ఇంటికి ఫోన్ చేయగా, ఫోన్ ఎత్తి అమ్మ బెడ్రూమ్ నుండి బయటకు రావడంలేదని తెలిపిన కొడుకు అనురాగ్. పక్కింటి మహిళకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో, ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే తల్లి, కూతుళ్లు చనిపోయినట్టుగా గుర్తించిన మహిళ . యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa