పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మట్టి గణపతిని పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద మునిసిపాలిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తో కలిసి ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విఘ్నేశ్వర నవరాత్రులలో మట్టి గణపతిని ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని, అలాగే పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa