ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదానికి గురైన మహబూబ్‌నగర్ డీఎస్పీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 02:31 PM

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన విధులను ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడగా, ఆయన కారు డ్రైవర్ రంగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.సీఎం పర్యటన ముగిసిన అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లు తన అధికారిక ఇన్నోవా వాహనంలో మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని గంగాపూర్ వద్ద ఎదురుగా వచ్చిన మరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాదంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ముఖం, మోకాలికి గాయాలయ్యాయి. డ్రైవర్ రంగారెడ్డి తీవ్రంగా గాయపడటంతో ఇద్దరినీ హుటాహుటిన మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa