ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ నేతల అరెస్టు.. పోలీస్ స్టేషన్ కు తరలింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 01:49 PM

త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, వారి పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. సోమవారం షాద్‌నగర్ నియోజకవర్గం అయ్యవారిపల్లి, భీమారం గ్రామాలకు చెందిన నేతలు వీరేశం, శివలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏళ్ల తరబడి భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న పేద రైతుల పొట్టను కొట్టేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని, నిరసన తెలిపే స్వేచ్ఛను కూడా ఇవ్వకుండా అరెస్టులతో బెదిరింపులకు దిగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa