తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, హైదరాబాద్ మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలను తప్పించి మిగతా అన్ని జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. ఈ పరిణామంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల్లో బిల్లుల చెల్లింపులపై అనుమానాలు ఉత్పన్నమయ్యాయి.ఇప్పుడిగానూ పని ప్రారంభించిన లబ్ధిదారులకు బిల్లులు అందుతాయని, కానీ కొత్త నిర్మాణాలు లేదా కొత్త లబ్ధిదారులకు నిధుల విడుదల ఎన్నికలు ముగిసే వరకు నిలిపివేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టం చేసింది. ఈ నియమాలు నవంబర్ 11 వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
ఎన్నికల నియమావళి ప్రకారం,మంత్రులు, అధికారులు కొత్త పథకాలు ప్రారంభించకూడదు, శంకుస్థాపనలు జరపకూడదు.
విచక్షణ నిధుల నుండి కొత్త గ్రాంట్లు లేదా చెల్లింపులు మంజూరు చేయకూడదు.
అధికార వాహనాలు, యంత్రాంగాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.
ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారుల బదిలీలు, పోస్టింగ్లు ఎస్ఈసీ అనుమతి లేకుండా జరగరాదు.
లౌడ్స్పీకర్లు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిషేధించబడ్డాయి.
అత్యవసర పరిస్థితుల్లో, కరువు, వరదలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే, ప్రజలకు సహాయం ఎస్ఈసీ అనుమతితోనే అందించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa