జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు చోరీ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో, ఈ అంశంపై కేటీఆర్ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ని మార్గాలు ప్రయత్నించినా గెలవబోయేది మాత్రం బీఆర్ఎస్నే అని ధీమా వ్యక్తం చేశారు.కేటీఆర్ తెలిపిన వివరాల ప్రకారం — గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 లక్షల 75 వేల ఓటర్లు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షల 98 వేలుగా పెరిగిందని, కేవలం కొన్ని నెలల్లో 23 వేల ఓట్లు ఎలా పెరిగాయి? అని ప్రశ్నించారు. ఆయన ఈ వివరాలతో చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్కు పూర్తి ఆధారాలతో వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.అంతేకాకుండా, కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ఓటర్ ఐడీలు పంచడం సీరియస్ అంశమని అన్నారు. “ఓటర్ ఐడీలు పంచే అధికారం అతనికి ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నిస్తూ, ఎన్నికల అధికారులు ఆ ఐడీలు ఫేక్ అని నిర్ధారించారని, అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.అదేవిధంగా, కేటీఆర్ పేర్కొన్నట్లు, ఈ ఫేక్ ఓటర్లలో మైనర్లు కూడా ఉన్నారు. ఉదాహరణగా, సంస్కృతి అపార్ట్మెంట్లో 43 మంది ఓటర్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ, అక్కడి నివాసితులు “వాళ్లెవరూ ఇక్కడ ఉండరని” చెప్పారని తెలిపారు. అలాగే బూత్ నెంబర్ 125లో ఒకే చిరునామాకు 23 ఓటర్లు నమోదు అయ్యారని, కానీ ఆ చిరునామా వద్ద వారెవ్వరూ నివసించడం లేదని చెప్పారు.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — 118 ఇంటి నెంబర్గా ఉన్న కాంగ్రెస్ నేత ఇంటి అడ్రెస్పై 32 ఫేక్ ఓటర్ ఐడీలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం కాంగ్రెస్ కుట్రలో భాగమని, ఎన్నికల అధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa