ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలంలోని మల్లన్నపాలెం గ్రామంలో శుక్రవారం నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ లాంఛనంగా ప్రారంభించి రైతులతో మమేకమయ్యారు.
ప్రారంభోత్సవం అనంతరం ఇద్దరు నాయకులు రైతులతో సమీపంగా మాట్లాడుతూ ఈ సీజన్లో వరి దిగుబడి, నీటి లభ్యత, ఎరువుల సమస్యలు, మార్కెట్ ధరల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం లభించడంతో సంతోషం వ్యక్తం చేశారు.
రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ “రైతు కష్టించి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుంది, ఒక్క రూపాయి కూడా నష్టం జరగనివ్వము” అని హామీ ఇచ్చారు. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఇవన్నీ రైతాంగానికి పట్టుగొమ్మని గుర్తు చేశారు.
ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభంతో మల్లన్నపాలెం పరిసర ప్రాంత రైతులకు ధాన్యం అమ్మకం సులభమైంది. ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే న్యాయమైన ధర, త్వరిత చెల్లింపులు లభిస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa