ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించిన మారబోయిన రవి యాదవ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 02:38 PM

శేరిలింగంపల్లి నియోజకవర్గం, డివిజన్-106లోని పాపిరెడ్డి కాలనీ ప్రాంతంలోని చందనగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలో  వర్షపు నీటితో పూర్తిగా నిండిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలుసుకొని పాపి రెడ్డి కాలనీ అండర్ పాస్ బ్రిడ్జ్ లో మురుగు నీరు తొలగించిన మారబోయిన రవి యాదవ్ .సొంత ఖర్చుతో ఎనిమిదో సారి నీరు తొలగించడం జరిగింది. వర్షాకాలం అయిపోయి కూడా నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏ అధికారి కానీ నాయకుడు కానీ ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ కానీ పట్టించుకోని పాపాన పోలేదు. ప్రస్తుతం ఉన్న అండర్ బ్రిడ్జ్ నుండి 40 నుంచి 50 వేల వాహనాలు రోజు ప్రయాణిస్తాయి. చందానగర్ మరియు హుడా కాలనీ వెళ్ళడానికి ఈ అండర్‌పాస్ ఉపయోగపడుతుంది; ప్రత్యామ్నాయ మార్గంగా లింగంపల్లి చుట్టూ తిరిగివెళ్లితే సుమారు 5 కిలోమీటర్ల దూరం అవుతుంది, అండర్‌పాస్ ఉపయోగిస్తే ఇది కేవలం 2–3 కిలోమీటర్లు పరిధిలో ఉంటుంది. దిశాబద్ధత లేకపోవడంతో లింగంపల్లి అండర్‌పాస్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ సంభవించటం, పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణంలో తీవ్ర అసౌకర్యం అనుభవించటం సాధారణం అయింది.మారబోయిన రవి యాదవ్ గారు విజ్ఞప్తి చేశారు — సంబంధిత GHMC విభాగాలు, స్థానిక కార్పొరేటర్  కానీ నాయకులు కానీ ఈ పరిష్కారాన్ని శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమం లో కే.ఎన్.రాములు, వెంకటరెడ్డి, గడ్డం శ్రీనివాస్, గంగాధర్ గౌడ్, నవీన్ గౌడ్, మున్నా, వాకిటి శంకర్, సాయి నందన్ ముదిరాజ్, పవన్,  శ్రీకాంత్ యాదవ్, కృష్ణ, మోష తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa