కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురంకు చెందిన సాధినేని దుర్గ (46) అనే మహిళ హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో మరణించింది. హుజూర్నగర్ లోని ఓ పారు బాయిల్డ్ మిల్లులో బూడిద ఎగుమతి చేయడానికి కూలికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు బూడిదలో పడి తీవ్ర గాయాలపాలైంది. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొంది, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa