ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండిగో నెట్‌వర్క్ పునరుద్ధరణ: నేడు 1500 విమానాలు నడపనున్నట్లు ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 12:39 PM

ప్రయాణికులను 6 రోజుల పాటు  ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో సంక్షోభంపై సంస్థ యాజమాన్యం స్పందించింది. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ అంతరాయాన్ని 95 శాతం పునరుద్ధరించినట్లు పేర్కొంది. డిసెంబర్ 07, ఆదివారం నాడు 1500 విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. శనివారం 700కు పైగా విమానాలు నడిపినట్లు తెలిపింది. ఈ సంక్షోభంపై కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శించారు. కేంద్రం ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, మేనేజర్ ఇసిడ్రో పొర్కురస్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa