ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లారెడ్డి వేల ఎకరాలు కబ్జా పెట్టిండు: కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 03:50 PM

మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో వేల ఎకరాలు కబ్జా చేశారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డును పరిశీలించిన అనంతరం, అంబేడ్కర్‌నగర్‌లో బస్తీవాసులతో మాట్లాడుతూ, మల్లారెడ్డి వల్ల నిరుపేదలకు ఒరిగిందేమీ లేదని, నియోజకవర్గంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. అంతా పైపై మెరుగులు దిద్దారని, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa