తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, అంబేద్కర్ మరియు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారిని స్మరించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa