ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కొడుకుపై కేసు పెట్టిన SHO బదిలీ: ప్రజాస్వామ్యానికి విరుద్ధం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 10, 2025, 11:01 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షపై భూ కబ్జా కేసు నమోదు చేసిన గచ్చిబౌలి SHO మొహమ్మద్ హబీబుల్లా ఖాన్‌ను సైబరాబాద్ పోలీస్ ‘వేకెన్సీ రిజర్వ్’కి బదిలీ చేయడం తీవ్రంగా ఖండించబడింది. నిజాయితీగా పనిచేసి “సురక్షిత్ హైదరాబాద్” అవార్డు అందుకున్న అధికారిని మంత్రి కొడుకు మీద కేసు పెట్టిన వెంటనే ఇలా ట్రాన్స్‌ఫర్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు, చట్ట పరిపాలనకు విరుద్ధమని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ఒత్తిడులతో కాకుండా, ప్రజల భద్రతను కాపాడే దిశగా నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa