ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గోల్డ్ కార్డ్' పథకాన్ని ప్రారంభించిన ట్రంప్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 11, 2025, 02:19 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్ఠాత్మక 'గోల్డ్ కార్డ్' పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం కింద 1 మిలియన్ డాలర్లు చెల్లించే వ్యక్తులకు, లేదా ఒక్కో విదేశీ ఉద్యోగికి 2 మిలియన్ డాలర్లు చెల్లించే కార్పొరేట్ సంస్థలకు అమెరికాలో చట్టబద్ధమైన నివాసం కల్పించి, పౌరసత్వానికి మార్గం సుగమం చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.వైట్‌హౌస్‌లో బుధవారం వ్యాపార ప్రముఖుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ-5 వీసా స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని, దేశ ప్రగతికి ఉపయోగిస్తామని ట్రంప్ తెలిపారు. "ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే కానీ, దానికంటే చాలా ఉత్తమమైనది, శక్తిమంతమైనది" అని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa