ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరంగల్‌లో సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 11, 2025, 02:56 PM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ సమయం ముగిసినప్పటికీ, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ పూర్తికావాల్సి ఉన్నా, చాలా మంది ఓటర్లు క్యూలో ఉండటంతో ఓటింగ్ ఆలస్యమైంది. ఒంటిగంట వరకు కేంద్రానికి వచ్చిన ఓటర్లకు అధికారులు ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం లైన్ లో ఉన్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం 5గంటల వరకు సమయం పట్టవచ్చని అంచనా. ఉమ్మడి జిల్లాలో ఒంటిగంట వరకు 84.2% ఓటింగ్ నమోదైనట్లు, 10-12% ఓటర్లు ఇంకా క్యూలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa