తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఈ దశలో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ 279 సర్పంచ్ స్థానాలను గెలుచుకోగా, బీఆర్ఎస్ 45, బీజేపీ 5, ఇతర అభ్యర్థులు 61 స్థానాలను దక్కించుకున్నారు.మొదటి విడతలో మొత్తం 3,834 సర్పంచ్ పదవులకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి.తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశ పోలింగ్ గురువారం (డిసెంబర్ 11) జరుగగా, రెండో దశ ఈ నెల 14న, మూడో దశ ఈ నెల 17న జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa