తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఓ మీడియా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్ ఛానల్కు ఈ నోటీసులు జారీ అయ్యాయి. తనపైనా, తన భర్త అనిల్పైనా నిరాధారమైన ఆరోపణలు చేశారని, వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత ఆ నోటీసులో డిమాండ్ చేశారు.ప్రస్తుతం కవిత "తెలంగాణ జాగృతి జనం బాట" పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ఈ యాత్రలో భాగంగా ఆమె వివిధ పార్టీల నేతలపై విమర్శలు చేస్తున్నారు. మొదట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కవిత, ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలపై దృష్టి సారించారు. నిన్న మలక్పేట, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో పర్యటించారు.ఈ క్రమంలోనే కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి కృష్ణారావు కూడా గట్టిగా బదులిచ్చారు. ఈ మాటల యుద్ధం నేపథ్యంలోనే ఆయనకు కవిత లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, టీ న్యూస్కు కూడా నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa