ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐ రంగంలో భారత్ మూడవస్థానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 14, 2025, 04:34 PM

ఏఐ రంగంలో భారత్ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వమున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేసిన 'గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్' ర్యాంకింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఈ ఘనతకు కారణమని నివేదిక పేర్కొంది.ఈ జాబితాలో 78.6 స్కోర్‌తో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 36.95 స్కోర్‌తో చైనా రెండో స్థానంలో నిలిచింది. భారత్ 21.59 స్కోర్‌తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూకే, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలను భారత్ అధిగమించడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa